NZB: సీజ్ చేసి నిల్వ ఉంచిన ఇసుకను ఈనెల 8న వేలం వేస్తున్నట్లు శుక్రవారం బాల్కొండ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు సీజ్ చేసి నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో ఇసుకను 8న పోలీస్ స్టేషన్ ఆవరణంలో వేలం వేస్తామని అన్నారు. ఆసక్తి గల వ్యక్తులు 8వ తేదీన ధరవత్తు రుసుము రూ. 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు.