BDK: సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును… బీజేపీ మండల అధ్యక్షుడు రాజేష్ నాయక్ వినతిపత్రం సమర్పించారు. గుడి తండాలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథ పైప్లైన్ ఏదైనా కారణాలతో ఆగిపోతే పది రోజుల వరకు గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, బోర్లు ఏర్పాటు చేయాలని కోరారు.