PDPL: కోలిండియా స్థాయిలో రాణించి సింగరేణి సంస్థ పేరు నిలబెట్టాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు అన్నారు. ఆర్జీ- 3, ఏపీఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి అథ్లెటిక్స్, స్విమ్మింగ్, త్రో బాల్ పోటీలను మంగళవారం రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ప్రారంభించారు.