PDPL: గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది. మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న 13 మందిని మేజిస్ట్రేట్ దుర్వ వెంకటేష్ ముందు హాజరుపరచగా, 12 మందికి రూ.28 వేల జరిమానా విధించారు. రెండోసారి పట్టుబడిన వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష పడిందని, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు.