SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయం అభివృద్ధిలో భాగంగా భక్తులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన జొన్నగాని రాజేష్ గౌడ్-సరిత దంపతులు, వారి తండ్రి జొన్నగాని యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి, స్వామివారి ఆలయ అభివృద్ధి నిధికి రూ.1,00,000 విరాళంగా సమర్పించారు.