MBNR: మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ బుధవారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అమలు తీరుపై అధికారులు బ్యాంకర్లతో సమీక్షలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సాందీపని ఆవాసం 20వ వార్షికోత్సవాల్లో పాల్గొననున్నారు.