మేడ్చల్: ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో ఎండు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అల్వాల్, వెంకటాపురంకి చెందిన అభిషేక్ కుమార్ సింగ్ అనే వ్యక్తి తన బైక్లో (5.147) కిలోల ఎండు గంజాయిని తీసుకెళ్తుండటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.