KMM: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధరావత్ బాలాజీ(40) ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడిన బాలాజీ మానసిక స్థితి బాగా లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.