SRD: నిరుద్యోగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ అన్నారు. డీవైఎఫ్ఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సదాశివపేటలో బుధవారం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.