ADB: గుడిహత్నూర్ మండలం నూతన ఎస్సై మహేందర్ ను సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో యువకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో యువత కీలకపాత్ర వహించాలని ఆయన పేర్కొన్నారు. యూత్ అధ్యక్షుడు జైపాల్, సావిందర్, పవన్, సునీల్, మోహన్, ఆకాష్, గౌరీ, విష్ణు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.