NRML: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏపీడీకి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 12న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.