NLG: హిందువుల అది పెద్ద పండుగ అయిన విజయదశమి (దసరా) సందర్భంగా నల్గొండ పట్టణంలోని శివారు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద హిందూ కుటుంబ సభ్యులకు పట్టణానికి చెందిన హిందూ ఫౌండేషన్ వారు నూతన వస్త్రాలను బుధవారం పంపిణీ చేశారు. చీరలు, రెడీమేడ్ దుస్తులను సంస్థ జిల్లా అధ్యక్షురాలు ఉమా భారతి పంపిణీ చేశారు. కార్యదర్శి ధనలక్ష్మి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.