HYD: అంబర్ పేటలోని బతుకమ్మ కుంట నిర్వహణ బాధ్యతను హైడ్రా తీసుకోవాలని వీ. హనుమంతరావు అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రాంత రూపురేఖలు మారిపోయాయన్నారు. బతుకమ్మ కుంట ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారిందని, దాని పరిరక్షణ బాధ్యతను హైడ్రా తీసుకోవాలన్నారు.