PDPL: పట్టణంలోని పాన్ షాపు యజమానులతో ACP జి. కృష్ణ బుధవారం సమావేశం నిర్వహించారు. రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిలు, యువకులకు అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో పట్టణంలో ఉన్న పాన్ షాప్లను రాత్రి 10లోపే మూసివేయాలని పాన్ షాప్ యాజమానులను ఆదేశించారు. అలాగే ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మడం, హుక్కా పాయింట్లు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.