VZM: నవోదయం 2.0లో భాగంగా కొత్తవలస మండలంలో నాటుసారా కేసుల్లో ముద్దాయిలపై బైండోవర్ నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ నాయుడు గురువారం తెలిపారు. తమన్నమెరక, జోడిమెరక, అప్పన్నదొరపాలెం, చినమన్నిపాలెం, ముసిరాం గ్రామానికి చెందిన 23 మందిని మండల మెజిస్ట్రేట్ బి. నీలకంఠరావు ముందు ప్రవేశపెట్టి కేసులు నమోదు చేశామన్నారు.