SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ఉదయం 10 గంటలకు మెలియాపుట్టి మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. మెలియాపుట్టి మండలం గోకర్ణ పురంలో గల రాధాకృష్ణ గడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కావున స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరుకావాలని కోరారు.