AP: జనసేన నేతలకు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించాలని తెలిపారు. త్రివిధ దళాల కోసం జనసేన పక్షాన మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని సూచించారు. ప్రతి క్షేత్రానికి ఒక ఎమ్మెల్యే, జన సైనికులను పంపించి పూజలు చేయించనున్నట్లు వెల్లడించారు.