ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ విచక్షణా రహితంగా భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వారి కృషి, ధైర్యసాహసాలను కొనియాడుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.