కోనసీమ: మండపేట మండలం కేశవరంలో ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను తక్షణమే నిర్మించాలని ఆ గ్రామానికి చెందిన జిల్లా ఆర్ టి ఏక్ట్ ఛైర్మెన్ వల్లూరి శ్రీ వాణీ డిమాండ్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ఆమె చేపట్టిన దీక్ష శుక్రవారంతో 22 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకోక పోవడం దారుణమన్నారు.