సత్యసాయి: ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లి తండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. నిన్న రాత్రి పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ మృతి చెందినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.