VZM: జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన దగ్గర ఉన్న వివిధ రకాల పుస్తకాలు అందరికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో తమను సంప్రదించిన మేరకు వారి ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామని జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పుస్తక హుండీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు.