ప్రకాశం: కనిగిరి మండలం బాలవెంకటాపురం గ్రామంలో ఈ నెల 14వ తేదిన నూతనంగా నిర్మించిన పట్టాభి సీతారామ చంద్రస్వామి నూతన విగ్రహ, శిఖర, ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవును కలిసి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.