SRD: కంగ్టిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్లోనే మరణించారు. స్థానికుల తెలిపిన వివరాలిలా.. మహారాష్ట్రలోని భూతం హిప్పర్గా కు చెందిన అశోక్ పాటిల్ కంగ్టి మండలం తుర్కవడగాంలో ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై బైక్పై తిరిగి వెళ్తున్న క్రమంలో కంగ్టిలోని డివైడర్ ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. కంగ్టి పోలీసులు కేసు నమోదు చేశారు.