వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టి నిర్మాణాలు చేపట్టిన యజమానికి నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులు నిశ్చయించారు. ప్రభుత్వ స్థలంలో బడ వ్యాపారి ఒకరు నిర్మాణాలు చేపట్టినట్టుగా అందిన ఫిర్యాదుల మేరకు తహసీల్దార్ ఇక్బాల్ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీ చేశారు. వెంటనే పనులు ఆపించాలని కూలీలను తాహసీల్దార్ ఆదేశించారు.