ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్వాచ్ టెక్నాలజీ ఇక మారనుంది. అవును ప్రస్తుతం ఆరోగ్య ఫీచర్లతో కూడిన స్మార్ట్ రింగ్(samsung galaxy Ring)లు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. దీంతో వీటిని ధరించి హెల్త్ ట్రాకింగ్ సహా అనేక విషయాలు తెలుకోవచ్చని అంటున్నారు. అందుకోసం ప్రముఖ సంస్థ శాంసంగ్ స్మార్ట్ రింగ్ లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిసింది.
డీప్ ఫేక్ స్కామ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసి.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి.. తర్వాత డబ్బులు గుంజుతున్నారు.
యూజర్ల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై వీడియో మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ సెలక్టెడ్ మొబైల్స్కే ఉండగా.. త్వరలో మిగతా మొబైల్స్కు అప్ డేట్ అవుతుందని మెటా తెలిపింది.
డ్రైవర్ లేని కారును మైనస్ జీరో అనే స్టార్టప్ కంపెనీ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని వీధుల్లో ఈ కారు ప్రత్యక్షం అవ్వడంతో స్థానికులు వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోసపూరితమైన స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఓ అద్భుతమైన అవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ఓపెన్ఏఐ చాట్జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఈ టెక్నాలజీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి రాబోతుంది.
ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.