WTC(2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ ఒక డ్రా, మరో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో గతంలో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆరో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-2లో కొనసాగుతున్నాయి. కాగా, పాకిస్తాన్ 5వ ర్యాంక్లో ఉండి భారత్ కంటే ముందుంది.