తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్చారు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కెసిఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా... తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే హైయెస్ట్ సాలరీ అందుకుంటున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ఆయనకు నెలకు నాలుగు లక్షల పదివేల రూపాయలు జీతంగా వస్తుందని పేర్కొన్నారు.
Ambati Rambabu : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని సైతం వదల్లేదు. చంద్రబాబు అతి మానిప్యూలేటర్ అని ఆరోపించారు.
Lalit Modi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కొత్త తలనొప్పులు మొదలౌతున్నాయి. మోదీలపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం రేపాయి. ఈ కామెంట్స్ కారణంగానే ఆయన తన ఎంపీ పదవికి దూరం కావాల్సి వచ్చింది. తాజాగా.. ఆయనకు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ రూపంలో మరో సమస్య ఎదురైంది.
ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ పైన నిర్మల సీతారామన్ రూ.7 లక్షల జీఎస్టీని ఎత్తివేసి, ప్రాణాలు కాపాడారని, ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
తెలుగు దేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీలోకి రావడానికి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లేదంటే తమ పార్టీ నాయకులు ఆయనతో టచ్ లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.
వ్యక్తిగత విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు జగన్ ఇస్తున్నాడని ఆరోపించింది. కేసుల నుంచి తనను తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులను జగన్ వరుసగా కలుస్తున్నాడని తెలిపింది. అందుకే రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్ వెళ్లాడని పేర్కొంటోంది.
Kejrival : అసెంబ్లీలో తమ బలం చాటుకోవడానికి కేజ్రీవాల్ ఈ బలపరీక్ష తీర్మానానికి దిగారు. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస ఓటును తీసుకురావాలని చూసిందని, అయితే ఇందుకు సరైన రీతిలో ఎమ్మెల్యేల బలాన్ని సంతరించుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.
కంపెనీలు, పరిశ్రమల వద్ద సెల్ఫీలు తీసుకుని సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కంపెనీలు మీరు తీసుకురాగలరా? అంటూ చాలెంజ్ విసరడం ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
షెట్కారీ సంఘటన్ కలిసి పని చేయడానికి ముందుకు రావడం కేసీఆర్ కు మరింత బలం ఇవ్వనుంది. మరి వీరి లేఖకు కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వీళ్లు కలిసి వస్తామని చెప్పడంతో కేసీఆర్ వారిని స్వాగతించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రగతి భవన్ కు షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు రానున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.