గౌతమ్ అదానీ ఇష్యూపై లోక్ సభ అట్టుడికింది. అదానీకి ప్రయోజనం కల్పించేందుకు నిబంధనలను మోడీ సర్కార్ మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపార రంగంలో రూల్స్ ఛేంజ్ ఎందుకు చేశారని అడిగారు. కేవలం అదానీ గ్రూపునకు మేలు చేయడానికేనని స్పష్టంచేశారు. ఎయిర్ పోర్టుల గురించి అనుభవం లేకుంటే వాటిని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ ఈ రూల్ను కేంద్ర ప్రభుత్వం మార్చింద...
ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే కారు స్పీడ్కు లిమిట్ ఉండదా? వేగంగా దూసుకెళ్లే అనుమతి ఎవరు ఇస్తారు. అది రద్దీగా ఉండే రోడ్ల మీద. చివరకు సామాన్యుల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో అదే జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉన్న కారు నగరంలోని రోడ్ల మీద వేగంతో దూసుకెళ్లింది. చివరకు ఒక సిగ్నల్ దగ్గర ఆగకుండా ముందు ఉన్న వాహనాలను ఢీకొట్ట...
ఛత్తీస్గఢ్లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: సీఎం జగన్ కు ‘అప్...
వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. మచిలీపట్నంలో ప్రభుత్వ భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయింపుపై రవీంద్ర నిన్న ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన మీడియా ముందుకు వచ్చారు. పార్టీ ఆఫీసు పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమి దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని రవీంద్ర ఆరోపించారు. రూ.300 కోట్ల విలువ గల భూమిని కబ్జా చేసేందుకు నాని ప్రయత్నిస్తున్నారని తెల...
ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా… అంటూ బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నోరా ఫతేహీ గుర్తుందా? అదొక్కటే కాదు.. చాలా సినిమాల్లో నోరా ఐటెమ్ సాంగ్స్కి డ్యాన్స్ వేసి రచ్చ చేసింది. నిజానికి బాలీవుడ్లో తను స్టార్ హీరోయిన్. కానీ.. తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకుంది. తన అందానికి పడిపోయారు. బాలీవుడ్లో బిజీ బిజీగా ఉండే నోరా ఫతేహీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ హడావుడి...
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చ...
రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వహిందు పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. లవర్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దామని వీహెచ్పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జ...
కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి. దీంతో ఈ రోజు నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు. ఈ మార్గంలో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే బస్ రూట్స్ లో కూడా డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్ర...
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేశారని విమర్మనాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్దం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసిఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు. జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ను ...
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం(Turkey earthquake) ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఇరు దేశాల్లో భూప్రకంపనల దాటికి జరిగిన విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆ క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. Shocked to see the visuals of devastation in Turkey &am...
శ్రీశైల మహాక్షేత్రంలో పిబ్రవరి 11 నుంచి 21 తేదీ వరుకు మహాశివ రాత్రి బ్రహ్మొత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ది చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తా...
ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...
తనకు కాబోయేవాడికి మైక్రోసాప్ట్ లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టంట పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులపైనే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటిదే ఓ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్గా మారింద...