అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని.. అన్నారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది.
Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.
ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.
కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.