• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Rain Alert: తెలంగాణలో దంచికొట్టనున్న వర్షం..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.

March 26, 2023 / 04:59 PM IST

CM Kcr:కేసీఆర్ నాందేడ్ వస్తేనే రూ.6 వేలు ఇచ్చారు:గులాబీ దళపతి నిప్పులు

CM Kcr:తెలంగాణ (telangana) మోడల్‌గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ‌లో కేసీఆర్ పాల్గొన్నారు.

March 26, 2023 / 04:48 PM IST

TS RTC : ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్త్రెవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు బెంగళూరు(Bangalore), హుబ్లీ, ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నై...

March 26, 2023 / 04:03 PM IST

Puvvada ajay తనను ఓడించేందుకు ట్రై చేశారు..? ఈ సారి ఖమ్మంలో అలా ఉండదు: పువ్వాడ

Puvvada ajay kumar:రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది.ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు అంత పట్టు లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada ajay kumar) ఒక్కరే గెలిచారు.ఈ సారి మాత్రం అలా ఉండదని ఆయన అంటున్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.

March 26, 2023 / 04:00 PM IST

Lucknow : విద్యార్ధులకు యూపీ సర్కారు గుడ్ న్యూస్…25వేలహెల్త్ కవరేజీ

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కారు విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. లక్నో (Lucknow) మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు. లక్నో స్మార్ట్ సిటీ (Smart city) లక్నో ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొన్ని కళాశాలలు, స్కూళ్లలో చదివే 2,000 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ (Health checkup) చేయనున్నారు. వారికి రూ.25వేల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ (Healt...

March 26, 2023 / 03:21 PM IST

Rapaka vara prasad:సిగ్గు, శరం వదిలేస్తే.. రూ.10 కోట్లు వచ్చేవి: రాపాక వర ప్రసాద్

Rapaka vara prasad:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు.

March 26, 2023 / 03:12 PM IST

YS Sharmila:నీ వాటా, కోటా కోసం అంటూ కేటీఆర్‌పై షర్మిల ఫైర్

YS Sharmila:పేపర్ లీకేజ్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతూనే ఉంది. ఈ ఇష్యూపై విపక్ష నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.

March 26, 2023 / 03:06 PM IST

NTR30:లో చేరిన ప్రముఖ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్

దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva)తో ఎన్టీఆర్‌(jr ntr) చేస్తున్న 30వ(ntr30) చిత్రంపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ Ntr30లో చేరినట్లు ప్రకటిస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్...

March 26, 2023 / 01:49 PM IST

D Srinivas: మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన డీ శ్రీనివాస్‌

సీనియర్‌ నేత, టీఆర్‌ఎస్‌ మాజీ రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్‌(D Srinivas) మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ(congress party)లో చేరారు. దీంతోపాటు అతని కుమారుడు కుమారుడు డి సంజయ్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్‌ చేరుకుని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీ కుండువా స్వీకరించారు.

March 26, 2023 / 01:08 PM IST

Paleru: పాలేరు టిక్కెట్ ఈసారి నాదే..కీలక నేతల వ్యాఖ్యలు

ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్‌ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని ఇటీవల అన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala nageswara rao), సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha sara...

March 26, 2023 / 12:49 PM IST

US President: చైనాను పొగిడిన బైడెన్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్‌(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

March 26, 2023 / 12:11 PM IST

Rahul Gandhi: అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహం

రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నార...

March 26, 2023 / 11:42 AM IST

Lb Nagar: ఓ వైపు కేటీఆర్ ప్రసంగం..మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతల లొల్లి

హైదరాబాద్ ఎల్‌బీనగర్‌(LB Nagar)లో నిన్న మంత్రి కేటీఆర్‌(KTR) సమక్షంలోనే బీఆర్‌ఎస్‌ నేతల(BRS leaders) మధ్య వాగ్వాదం బయటపడింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య గొడవ చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని నియంత్రించారు.

March 26, 2023 / 11:15 AM IST

Visakhapatnam: ఈనెల 28న విశాఖలో జీ20 సమ్మిట్..నేడు మరథాన్ నిర్వహణ

గ్రేటర్ విశాఖపట్నం(Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మార్చి 28, 29 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే బీచ్ లో జీ20 సన్నాహక మరథాన్(Marathon) కార్యక్రమం చేపట్టగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనిలు హాజరై ప్రారంభించారు. 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు G20 సమ్మిట్ సందర్భంగా నగరాన్ని సందర్శించవచ్చు.

March 26, 2023 / 10:45 AM IST

Bandi Sanjay: నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం!

TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌(Bandi Sanjay)కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం హాజరు కావాలని సిట్(SIT) తెలిపింది. కానీ ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది.

March 26, 2023 / 10:10 AM IST