మహబాబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గతంలో పూర్తికాని కాలువలను చూసి మనసు చలించేందని గుర్తుచేసుకున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని మెగా సోదరుడు నాగబాబు అన్నారు. రణస్థలంలో జరుగుతున్న జనసేన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. జనసేన ఓ కుటుంబ పార్టీ కాదని అందరి పార్టీ అని తెలిపారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానన్నారు. సామాన్య కార్యకర్త నుండి ఎవరైనా జనస...
తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...
సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగ...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...
ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పండగ కోసం ఊరికి వెళ్లే ప్రయాణికుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. టికెట్పై మూడు, నాలుగింతలు పెంచేసి ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. అయినా సరే.. పండుగ పూట సొంతూరికి వెళ్దాం అనుకుంటే.. సేఫ్టీ నిబంధనలు, ఫిట్ నెస్ లేని బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు. మామూలు రోజుల్లో అయితే ఒకరికి రూ.1000 ఉండే టికెట్ ధర పండ...
అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింద...
మునుగోడు ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆ పార్టీ అధిష్టానం కోపంగా ఉంది. మునుగోడులో ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవదని కామెంట్లు చేయడం, దీనికి తోడు.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించమని ఫోన్లలో మాట్లాడటం వంటి చర్యల పట్ల పార్టీ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే..తాజాగా తెలంగాణ కా...
భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షు...
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని రాశారు. అయితే.. దాన్ని తప్పు పడుతూ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన ట్వీట్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. బుధవారం నాడు సీఎం జగన్ చేసిన ట్వీట్ కింద.. సింగర్ అద్నాన్ సమీ [&hel...
భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్లను ఉజ్బెకిస్థాన్లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిం...
త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేం...
తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇం...
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనమని, ఈ రెండు పార్టీలకు త్వరలో మూడో పార్టీ కూడా కలుస్తుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభావమే లేకుంటే, సొంత పేపర్లో అధికార పార్టీ అలా అక్కసు వెళ్లగక్కదన్నారు. ఈ రెండు పార్టీల కలయికతో అధికార పార్టీ గందరగోళానికి గురవుతోందని, ఆ పార్టీలకు నిజంగానే బలం లేకుంటే జగన్ ప్రభుత్వానికి తత్తరపాటు అవసరం లేదన్నారు. చంద్రబాబ...