• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘2027 గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలి’

E.G: 2027 గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద సమగ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా SP డీ.నరసింహ కిషోర్, JC వై.మేఘా స్వరూప్ పాల్గొన్నారు. పుష్కరాల కోసం పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్‌ల ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

February 21, 2026 / 03:44 PM IST

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే..!

NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 21, 2026 / 03:43 PM IST

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, విధుల నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాల దరఖాస్తులపై సమీక్ష చేశారు.

February 21, 2026 / 03:43 PM IST

బాన్సువాడ ఘటనపై బీజేపీ చీఫ్ ఫైర్

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాత్రి BJP నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని.. పోలీసుల బలప్రయోగంతో, నిరంకుశ చర్యలతో ఆ హక్కును కాలరాయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.

February 21, 2026 / 03:42 PM IST

శానిటరీ వర్కర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ

PLD: సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శానిటరీ వర్కర్లకు శనివారం ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికులకు ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెన్నకేశవరావు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:42 PM IST

పదవ తరగతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది

పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ అని ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శ్రీ లక్ష్మి హై స్కూల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, టెన్త్ మార్కులు ఉన్నత చదువులకు పునాది అవుతాయని తెలిపారు. ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 03:41 PM IST

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సుమన్ కుమార్

SDPT: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 28 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:41 PM IST

ఎస్పీని సన్మానించిన దేవస్థాన అధికారులు

GNTR: వడ్లమూడి బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా సమగ్ర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. తిరునాళ్లకు భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.

February 21, 2026 / 03:40 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం ఎలకుంట్ల గ్రామంలో చింతచెట్టు పైనుంచి పడి దాసరి రాము అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధా రాఘవ శనివారం మృతుడి నివాసానికి వెళ్లి భార్య ఓబులమ్మను పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

February 21, 2026 / 03:40 PM IST

గన్నవరంలో ఫ్లైట్ నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన

NTR: గన్నవరం నుంచి బయలుదేరే షార్జా ఫ్లైట్‌ని శనివారం ఎయిర్‌పోర్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతో సుమారు 163 మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. షార్జాలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిబ్బంది వెల్లడించారు.

February 21, 2026 / 03:40 PM IST

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: ఆర్డీవో

ATP: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధమని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని అన్నారు.

February 21, 2026 / 03:40 PM IST

వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి అంకురార్పణ

కోనసీమ: అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలకు శనివారం రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని నియోజకవర్గ ప్రజలందరిపై ఆ స్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:40 PM IST

చిత్తూరు ఎంపీని కలిసిన జనసేన నాయకులు

CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును ఇవాళ ఆయన కార్యాలయంలో జనసేన నాయకులు ఎం. మహేష్ స్వేరో, తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తవణంపల్లి మండలం, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసాదాలను ఎంపీకి అందజేశారు.

February 21, 2026 / 03:39 PM IST

పార్టీలోకి కొత్త రక్తం రావాలి: మల్లోజుల

TG: మావోయిస్టు మాజీ అగ్ర‌నేత మ‌ల్లోజుల వేణుగోపాల్ మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మావోయిస్టు ఉద్య‌మానికి మ‌నుగ‌డ లేద‌న్నారు. ఉద్య‌మంలో ఉన్న‌వాళ్లంతా వృద్ధులైపోయార‌ని, మావోయిస్టు పార్టీలోకి కొత్త ర‌క్తం రావ‌డంలేద‌ని చెప్పారు. తనను ద్రోహి అంటున్నారని.. వారికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.

February 21, 2026 / 03:38 PM IST

టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచలన ఆరోపణలు

AP: వేద పండుతుల పోస్టుకు డబ్బులు వసూలు దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. తమ హయాంలో 700 పోస్టులు మంజూరు చేశామన్నారు. 4 నెలల ముందు ఇంటర్వ్యూలు జరిగినా ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. తప్పులు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారని.. BR నాయుడు ఆధ్వర్యంలో అరాచకం జరుగుతోందని ఆరోపించారు.

February 21, 2026 / 03:38 PM IST