GDWL: పట్టణంలోని 28వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ముందడుగు వేశారు. వేసవిలో నీటి కొరత పెరుగుతుందన్న అంచనాతో పాత బోర్వేర్లను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పనిచేయకుండా ఉన్న బోర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు.
సత్యసాయి: జిల్లా ప్రజల దాహార్తి తీరుస్తున్న సత్యసాయి తాగునీటి పథకాన్ని జిల్లా పరిషత్తులో విలీనం చేయవద్దని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అసెంబ్లీలో కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. విలీనం చేస్తే గ్రామ పంచాయతీలు నిర్వహణ భారమై ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. సత్యసాయిబాబా ఆశయం దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
MBNR: మహబూబ్నగర్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి. జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
NGKL: రాబోయే వేసవి కాలంలో నాగర్కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలలో నీటి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, పారిశుధ్య పనులు సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
VZM: చీపురుపల్లి పట్టణం బాలుర పాఠశాలను ఇవాళ డిప్యూటీ డీఈవో వెంకటరమణ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన మెనూ వైట్ రైస్, కోడిగుడ్డు కూర, సాంబార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బూసి నాయుడు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
TPT: చంద్రగిరి RF రోడ్డులో విషాదం నెలకొంది. కడప జిల్లాకు చెందిన సాధిక్ అనే యువకుడు తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
WNP: మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల కార్యక్రమాల నిర్వహణ కోసం వేదిక (స్టేజ్) నిర్మాణం, బాలికల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ నిర్మాణం వంటి పనులు చేపట్టారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు అని డిఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. మోడల్ స్కూల్ సెంటర్లో 177 మంది విద్యార్థుల్లో 174 మంది హాజరు అయ్యారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.
SRD: పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని తోషిబా పరిశ్రమ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు పరిశ్రమ సహకారం కోరారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్పర్సన్గా గోనె లహరి, వైస్ ఛైర్మన్గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వేను ఈనెల 21వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 96,150 కుటుంబాలకు సర్వే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.
ప్రకాశం: మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.
జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ అతిథి పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ఓ సన్నివేశంలో అఖిల్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
VKB: TGBIE స్టూడెంట్స్ & పేరెంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ప్రారంభించింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు వంటి అంశాలపై మార్గదర్శనం, సందేహాలు నివృత్తి కోసం విద్యార్థులు కాల్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ పేర్కొన్నారు. హెల్ప్లైన్ నంబర్లు: 040-24655027, IVR 9240205555. విద్యార్థులు అవసరమైన సాయం కోసం వెంటనే సంప్రదించవచ్చని సూచించారు.