PDPL: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. 8 ఇంక్లైన్ సిర్కే బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత నియమాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి హనం వాహనాలు నడపవద్దని సూచించారు. పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
AKP: చీడికాడ మండలం మంచాల మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26లో 5వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
MLG: మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని కాలువలో పడి ఒడిశాకు చెందిన మిఠాలాల్ టండి (55) మృతి చెందాడు. ఇటుక బట్టీ పనుల కోసం ములుగుకు వచ్చిన ఆయన శనివారం వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WNP: మస్తిపురం ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై స్వాతి ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తూ, అందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
GDWL: జిల్లాలో విషాదం నెలకొంది. ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
NLG: చండూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ, భేరి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మండపంలో పురోహితులు హరికిషన్ శర్మ, ప్రవీణ్ శర్మల ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు.
GNTR: IERP స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి రెగ్యులర్ ఉపాధ్యా యులుగా గుర్తించి పే స్కేలు అమలు చేయాలని NTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగల హైమారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నివాసంలో కలిసి NTA సభ్యత్వం అందజేసి, వినతిపత్రం అందించారు.
WGL: TG Ed.CET-2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. WGLలోని KUలో ఎడ్సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్సైట్ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షా షెడ్యూల్తో పాటు ముఖ్యమైన తేదీల వివరాలను ప్రకటించనున్నారు. బీ.ఎడ్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు సోమవారం నుంచి అధికారిక వెబ్సైట్లో కీలక సమాచారం పొందవచ్చు అన్నారు.
KRNL: బతుకుతెరువుకోసం కూలీలు వలసబాట పట్టారు. నందవరం నాగలదిన్నె గ్రామానికి చెందిన 50 మంది ఆదివారం రాత్రి రెండు బొలేరో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించక గుంటూరు మిర్చి కోతలకు వలసలు వెళ్తున్నామన్నారు. గత మూడు రోజుల్లో ఆరు వాహనాల్లో 200 మంది వలసల వెళ్లారని గ్రామస్తులు తెలిపారు.
NZB: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లను ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ డివిజన్ తో పాటు NZB నగర అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
NTR: విజయవాడ రాజీవ్ పార్క్ నుంచి గంగూరు కూడలి వరకు 14KM పొడవున ఆరు వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఒకే ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలా లేక కనకదుర్గ వారధి–BENZ సర్కిల్, BENZ సర్కిల్–గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాలా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భూ సేకరణ జరగనుందని అధికారులు తెలిపారు.
VKB: మైనారిటీ యువత ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం సబ్సిడీ స్కూటర్ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా అధికారి ఎస్. రాజేశ్వరి తెలిపారు. రూ. 1.50 లక్షల విలువైన వాహనంపై రూ. 1.20 లక్షలు సబ్సిడీగా అందించి, లబ్ధిదారుడు రూ. 30 వేలే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 21-40 సంవత్సరాల వయస్సు, పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తప్పనిసరి అన్నారు.
సూపర్ 8 ఆరంభంలోనే భారత్ చతికిలపడింది. దీంతో 2024 వన్డే WC ఫైనల్ తర్వాత ICC టోర్నీల్లో తొలి ఓటమి చవిచూడక తప్పలేదు. ఇందుకు పవర్ ప్లేలో టాపార్డర్ వెనుదిరగడం, చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలు లేకపోవడం, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమే ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. గత టోర్నీ తర్వాత 8 సిరీస్ విజయాలతో పొందిన ఆనందం కంటే ఈ ఓటమి ఎక్కువగా నొప్పిస్తోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
MDCL: బీఆర్ఎస్కు చెందిన కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో చేరాడు. ఎమ్మెల్యే కెపి వివేకానందకు బాబాయ్ కావడంతో ఈ చేరిక స్థానికంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.