• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు’

NZB: బాల్య వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగేరి బాబు హెచ్చరించారు. శుక్రవారం రుద్రూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

February 20, 2026 / 04:49 PM IST

ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడారు. 22వ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22ఏ భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారులను బదలాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.

February 20, 2026 / 04:48 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు!

PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:47 PM IST

‘రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలి’

ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

February 20, 2026 / 04:46 PM IST

అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

KRNL: పత్తికొండలో చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు . మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇళ్ల తలుపులు, వాహనాలు సురక్షితంగా లాక్ చేసుకోవాలని, సూచించారు.

February 20, 2026 / 04:46 PM IST

T20 WC చరిత్రలో ఇదే మొదటిసారి

2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

February 20, 2026 / 04:46 PM IST

ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హానికరం

ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.

February 20, 2026 / 04:45 PM IST

సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఓయూలో జరిగిన సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన ఈ సమావేశం “Creating AI & Quantum Enabled Higher Educational Institutions” అంశంపై జరిగింది. తెలంగాణ గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:45 PM IST

రేవంత్ రెడ్డి.. రైతు బంధు ఏమైంది?: హరీష్ రావు

TG: ఏపీ నల్లమలసాగర్ కడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణాలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఎప్పటికప్పుడు రైతుబంధు అంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు.

February 20, 2026 / 04:44 PM IST

అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐసీడీఎస్ పీడీ

KRNL: ఆదోని పట్టణ పరిధిలోని తిక్క స్వామి దర్గా ప్రాంతంలోని అంగనవాడీ కేంద్రం 85ను శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , సీడీపీఓ ఢిల్లీ ఈశ్వరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, పీడీ విజయ పిల్లలు హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే పిల్లలుకు ఇస్తున్న ఆహరం, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందు సరుకుల నిలువ, కేంద్రం పరిశుభ్రతను తనిఖీ చేశారు.

February 20, 2026 / 04:43 PM IST

ఘనంగా సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు

SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో సంత్ శ్రీ గురు రవిదాస్ 649వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని సంత్ రవిదాస్ విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:42 PM IST

ఆ ఘనత మా ప్రభుత్వానిదే: గొట్టిపాటి

AP: అప్పుల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో తొలిసారి 13 పైసలు ట్రూడౌన్ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1.5కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. యూనిట్ కొనుగోలు ధరను రూ.6.35ను తగ్గించి రూ.340 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు.

February 20, 2026 / 04:41 PM IST

‘సహకార సంఘ ఉద్యోగులకు సీఎం సహకరించాలి’

ELR: సహకార సంఘ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సహకరించాలని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చాట్రాయి కోపరేటివ్ యూనియన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద నూజివీడు నియోజకవర్గ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు

February 20, 2026 / 04:41 PM IST

లడక్ శిక్షణకు విద్యార్థి ఎంపిక

SKLM: మెలియాపుట్టి మండల ZPHSకు చెందిన వీ. జ్ఞాన సాయి ఉన్నత ప్రతిభ కనబరిచారు. జ్ఞాన సాయి అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో శిక్షణ పొంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లడక్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు 1,2లు యస్. దేవేంద్రరావు, ఎం. పద్మనాభం,పాఠశాల H.M గీత, ఉపాధ్యాయులు జ్ఞాన సాయిని ఘనంగా సత్కరించారు.

February 20, 2026 / 04:41 PM IST

చీటింగ్ కేసు.. శిల్పాశెట్టి భర్తకు బెయిల్‌

బిట్‌కాయిన్ మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. ఆయనకు ముంబైలోని PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చింది.

February 20, 2026 / 04:40 PM IST