• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యూఎస్ లో కాల్పులు.. తీవ్రంగా గాయపడిన హైదరాబాద్ యువకుడు.. ట్రీట్ మెంట్ కు రూ.18 లక్షలు.. సాయం కోసం అభ్యర్థన

యూఎస్ లోని చికాగోలో హైదరాబాద్ కు చెందిన సాయి చరణ్ కొప్పాల ఇటీవల జరిగిన గన్ ఫైరింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ట్రీట్ మెంట్ జరుగుతోంది. సాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడికి వెళ్లడానికి, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు భారీగా ఖర్చు అవుతుందని అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. యూఎస్ లో ఆసుపత్రిలో చికిత్స కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.18 లక్షల...

January 27, 2023 / 05:21 PM IST

ఘనంగా రాకింగ్ రాకేశ్ నిశ్చితార్థం.. మంత్రి రోజా సందడి

జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ చాలా షోలలో కలిసి సందడి చేస్తున్నారు. తమ ప్రేమ బంధానికి వారి కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఇక వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాకేశ్, సుజాతల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా హాజరై...

January 27, 2023 / 05:14 PM IST

జియో వాడుతున్నరా.. ఆ రీచార్జ్ తో 23 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, ఫ్రీ డేటా

Jio Annual Plan : జియో నెట్ వర్క్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్. జియో కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ లో వార్షిక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. రూ.2999 పెట్టి జియో రీచార్జ్ చేయిస్తే సంవత్సరం పాటు జియో సేవలను వినియోగించుకోవచ్చు. 365 రోజుల పాటు ప్యాక్ వాలిడిటీ ఉంటుంది. రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే.. అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ […]

January 27, 2023 / 05:02 PM IST

నిన్న ఉద్యోగులను తీసేసి.. ఇప్పుడు ఆఫీసు బిల్డింగ్ లనూ అమ్మేస్తున్న టెక్ కంపెనీ

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ మాట తప్పించి వేరే వినిపించడం లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తో పాటు అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వేల మందిని ఒకేసారి తొలగించింది. దాదాపు 18 వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ కాస్ట్ కటింగ్ లో భాగంగా...

January 27, 2023 / 04:24 PM IST

భారత్-న్యూజిలాండ్ టీ20: ఉత్సాహంగా టీమ్ ఇండియా

న్యూజిలాండ్ – భారత్ మధ్య నేడు రాత్రి ఏడున్నర గంటలకు టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం భారత్ ఉత్సాహంతో ఉండగా, కివీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. హార్దిక్‌ పాండే నేతృత్వంలోని భారత్ జట్టు తన జోరును కొనసాగిస్తుందని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-న్...

January 27, 2023 / 04:22 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు

మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంపై తేమ అధికంగా ఉండటం వల్లనే అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురవనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్ర...

January 27, 2023 / 03:59 PM IST

సాక్షాత్తూ ఎన్టీఆర్ నే కాలితో తన్నిన హీరోయిన్

తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు పేరు అజరామరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు పొందిన అంతటి గొప్ప వ్యక్తిని ఓ హీరోయిన్ కాలితో తన్నింది. ఎన్టీఆర్ నే కాలితో తన్నేంత పొగరు ఆ హీరోయిన్ ఎక్కడిది? అని అప్పట్లో తీవ్ర వివాదం నడిచింది. ఎన్టీఆర్ నే తన్నేంత ధైర్యం ఎక్కడిది? ఇక ఆమెను సినిమాల నుంచి బహిష్కరిద్దామనే స్థాయికి వివాదం రేగింది. అయితే ఆమె వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతకీ ఎన్టీఆర్ న...

January 27, 2023 / 03:35 PM IST

ఏటీఎం మిషన్ ను ముక్కలు చేసి 38 లక్షలు దోచుకెళ్లారు.. వీడియో

ఈ మధ్య దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. టెక్నాలజీ ఎలా అప్ డేట్ అవుతుందో దొంగలు కూడా అలాగే అప్ డేట్ అవుతూ స్మార్ట్ గా దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. కొందరు దొంగలు కేవలం ఏటీఎం మిషన్లనే టార్గెట్ చేసుకుంటారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నా ముఖానికి ముసుగు వేసుకొని ఏటీఎంలను దోచుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో వరుసగా ...

January 27, 2023 / 03:24 PM IST

ప్రతి బాల్ ఫోర్, సిక్స్ కొట్టలేం: ప్రధాని మోదీ

విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని.. అలా రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిన్నారులకు గెలుపోటములను సమానంగా తీసుకోవడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థు...

January 27, 2023 / 02:42 PM IST

400 రోజులు ఉతికినా ఎలుక తోలు రంగు మారదు..అంబటి

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు...

January 27, 2023 / 02:34 PM IST

రేవంత్ రెడ్డి పాదయాత్ర షురూ.. మోడీ, కేసీఆర్‌‌ సర్కార్లపై విసుర్లు

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌ యాత్ర వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బొంరాస్‌పేటలో గల ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.పెట్టుబడి ఖర్చులు, మార్కెట్‌లో పంట...

January 27, 2023 / 02:06 PM IST

రమ్య నుంచి ప్రాణహానీ.. నటుడు నరేష్ హాట్ కామెంట్స్

మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్...

January 27, 2023 / 01:41 PM IST

‘యువగళం’పాదయాత్రలో బ్యానర్ల రగడ.. చించివేసిన దుండగులు

నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఉదయం 11.03 గంటలకు లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. యాత్ర ఆరంభంలో బ్యానర్ల చించివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు దుండగులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. మరికొన్ని బ్యానర్లకు నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించివేత కుప్పంలో వివాదానికి దారి తీసింది. దీంతో లోకేష్ షెడ్యూల్‌లో స్వల్...

January 27, 2023 / 12:16 PM IST

రష్యా – ఉక్రెయిన్ యుధ్దంపై అమెరికా కీలక వ్యాఖ్య

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ గెలుచేల చేస్తామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ గెలుపు లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించింది. పద్నాలుగు లెపర్డ్ యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ప్రకటన వచ్చింది. రష్యతో యుద్ధంలో గెలిచేలా సామగ్రి అందించడమే తమ మిత్ర దేశాల లక్ష్యం అని తెలిపింది. ఇప్పటికే...

January 27, 2023 / 11:53 AM IST

ఈపీఎఫ్‌వో షాక్: ఇక వృద్దులకు అధిక పెన్ష నో

పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్‌వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 20...

January 27, 2023 / 11:49 AM IST