• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తల్లి కాబోతున్న హిజ్రా.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు పుట్టబోతున్న బిడ్డ.. ఎక్కడో తెలుసా?

తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక హిజ్రా తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జియా పావల్, జహద్ పావల్.. ఇద్దరిదీ కేరళలోని కోజికోడ్. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్సే. తామ...

February 4, 2023 / 04:04 PM IST

జూ. ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు: లక్ష్మీపార్వతి

ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రయోజనం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అతని రాక ఇప్పటికే ఆలస్యం అయినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వలె ప్రజల్లో అయిదేళ్ళు ఉండాలని చెప్పారు. జూనియర్ అయిదేళ్ళు ప్రజల్లో ఉంటేనే వచ్చేసారి అవకాశం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కు పగ్గాలు ఇచ్చి ప్రజల్లో కొన్ని ఏళ్లు ఉంటే గానీ అప్పుడు అవకాశం ...

February 4, 2023 / 03:56 PM IST

ఎవరెస్ట్(everest) శిఖరం 360 డిగ్రీ వ్యూ..మరో అద్భుతం!

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్ర...

February 4, 2023 / 05:03 PM IST

జైసల్మీర్‌కు చేరుకున్న కియారా అద్వానీ.. వీడియో

బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ అంటే 4న హల్దీ, 5న సంగీత్ వేడుకలను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యగ్రహ్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. దీంతో పెళ్లి వేడుకల కోసం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్...

February 4, 2023 / 03:35 PM IST

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...

February 4, 2023 / 03:35 PM IST

ప్రముఖ సింగర్​ వాణీ జయరాం కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...

February 4, 2023 / 03:14 PM IST

మోస్ట్ పాపులర్ వరల్డ్ లీడర్‌గా ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మరో ఫీట్ సాధించారు. ప్రపంచంలో ప్రజాదరణ నేతగా మారారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోడీకి ఎక్కువ మంది ఓటు వేశారు. పాపులర్ లీడర్ సర్వేలోొ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను వెనక్కి నెట్టేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మోడీకి తమ ఓటు వేశారు. 22 దేశాలకు చెందిన ప్రజల అభిప్రాయం సేకరించారు. మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్...

February 4, 2023 / 02:51 PM IST

దేశం చూపు కేసీఆర్ వైపు, మోడీ దుర్మార్గమైన ప్రధాని: కేటీఆర్

ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది మోడీ కాదా అన్నారు. తమ నినాదం రైతు రాజ్యం అని.. వారిది మాత్రం కార్పొరేట్ రాజ్యం అని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినాదించారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని మోడీకి సెట...

February 4, 2023 / 02:28 PM IST

వైఎస్ విజయమ్మతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ..

వైఎస్‌ఆర్‌టీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్‌ఆర్‌టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంంది. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చే...

February 4, 2023 / 02:10 PM IST

రూ.99కే కేజీ చికెన్.. బారులు తీరిన జనం, ఎక్కడంటే?

చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందరూ లైక్ చేస్తుంటారు. పీసెస్ జ్యూసీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు. లేడీస్ కూడా అంతే.. ధర తక్కువగా ఉండటం మరో కారణం. శ్రావణ, కార్తీక మాసాలు.. ఏదైనా ఫ్లూ వచ్చిన సమయంలో ధర ఆమాంతం పడిపోతుంది. చలి, వర్షకాలంలో ధర ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఉండటంతో తప్పదు.. మరీ కిలో చికెన్ రూ.99కే లభిస్తే.. జనం ఎగబడతారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గల భారత్ చికెన్ [&he...

February 4, 2023 / 02:08 PM IST

పాదయాత్రను ఆపాలని లేదు, గైడ్ లైన్స్ పాటించాలి: డిఐజి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...

February 4, 2023 / 02:06 PM IST

కార్మికులకు వేతన సవరణ జీవో ను అందించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం శ్రీనగర్ కాలనీ వద్ద వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు, కార్మికులు కలిసి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నెంబర్. 8 ను మంత్రి సబితా చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు మాట్లాడ...

February 4, 2023 / 01:37 PM IST

కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్: సభలో కేసీఆర్ లేరనడంతో డైలాగ్ వార్

అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీలు ఇస్తారు అమలు చేయరని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ అనే సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ దూకుడుగా ఉంటారు. గతంలో పలు సందర్భాల్లో ఇలానే సభలో మాట్లాడారు. ఈ రోజు అలా మాట్లాడగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. సభ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ లేకుంటే ఏంటీ...

February 4, 2023 / 01:33 PM IST

కూలీగా మారిన హాకీ ప్లేయర్ కి ఉద్యోగం ఇచ్చిన పంజాబ్ సీఎం

పంజాబ్ హాకీ ఆటగాడు పరమ్ జీత్ కుమార్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఆడిన అతడు ప్రస్తుతం దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడని జాతీయ మీడియా వెలుగులోకి తేవడంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పరమ్ జీత్ కుమార్ కు క్రీడా శాఖలో కోచ్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. స్వయంగా సీ ఎం అండగా నిలబడడంతో అతడి కష్టాలకు ఫుల్ స్టాఫ్ పడుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. అండర్16, అండర్18...

February 4, 2023 / 01:21 PM IST

రుణమాఫీ కాలే, దళితులకు మోసం: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి రూ.3,881 కోట్లు రుణమాఫీ...

February 4, 2023 / 01:09 PM IST