• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 20, 2026 / 04:06 PM IST

ఈనెల 24న ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు

NRML: ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో విలీనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఆర్.రెడ్డి శుక్రవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. వేతన సవరణ అమలు, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లపై అన్ని డిపోల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

February 20, 2026 / 04:05 PM IST

‘కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి’

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకా పేరు ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

February 20, 2026 / 04:04 PM IST

జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తి: టీపీసీసీ చీఫ్

TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. మంత్రులపై కావాలనే BJP నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై CBI విచారణ చేయించాలని అడిగినా.. కిషన్ రెడ్డి స్పందించడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా బండి సంజయ్ బద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

February 20, 2026 / 04:03 PM IST

అభివృద్ధి దిశగా ఖానాపూర్ నియోజకవర్గం

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు,  భూమి పూజలను నిర్మల్ డసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఉట్నూర్‌లోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్‌లలో రూ.10 లక్షలతో వివో బిల్డింగ్స్‌కు భూమి పూజ చేశామన్నారు. అలాగే రూ. 20 లక్షలతో జీపీ భవనాలు ప్రారంభం అయ్యాయన్నారు.

February 20, 2026 / 04:02 PM IST

‘టికెట్ ఇస్తే పార్టీని మోసం చేశాడు’

ASF: నమ్మి కౌన్సిలర్ టికెట్ ఇస్తే పార్టీని మోసం చేసిన ఘనత మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌దని స్థానిక నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో యూత్ కాంగ్రెస్‌లో ఇచ్చిన ఏకైక టికెట్ శ్యామ్ వాళ్ళ భార్యకే అన్నారు. వారిని గెలిపించేందుకు తాము తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. మరోసారి పార్టీ పైన తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు.

February 20, 2026 / 04:02 PM IST

కొత్త ప్రాజెక్టుపై రామ్ పోతినేని ఫోకస్..!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్.. మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నాడట. రైటింగ్ టీంతో కలిసి స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్‌పై కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించే ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది.

February 20, 2026 / 04:02 PM IST

యువత స్వయంకృషితో ఎదగాలి: ఎస్సై

NLG: యువత స్వయంకృషితో ఎదగాలని చిట్యాల ఎస్సై రవి కుమార్ అన్నారు. చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ఏర్పాటు చేసిన బెల్లం చాయ్ షాప్‌ను శుక్రవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఆర్థికంగా ఎదగడం కోసం వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. నిర్వాహకులను ఎస్సై అభినందించారు.

February 20, 2026 / 04:01 PM IST

సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి: MLA

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఆకేరు వాగుపై చెక్ డాం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళుతుందని, నియోజకవర్గంలోని పంటల సాగుకు నీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

February 20, 2026 / 04:01 PM IST

శ్రీ కోదండస్వామి ఆలయంలో తిరు కళ్యాణోత్సవం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కోదండ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో స్వామివారికి తిరుకల్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట, తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కసాపురం ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:00 PM IST

అగ్నికి ఆహుతైన మామిడి తోట

సత్యసాయి: నల్లమడ మండలంలోని గోపేపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన తోలేటి ప్రభావతమ్మకు చెందిన మామిడి తోట ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఏడాది పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతుకు, ఈ ఘటన తీరని వేదన మిగిల్చింది.

February 20, 2026 / 04:00 PM IST

ఈనెల 22న జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

E.G: ఈనెల 22న రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం & క్రియాశీలక సభ్యత్వ నమోదు, పలు కమిటీల నిర్మాణం, తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కావున పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 20, 2026 / 04:00 PM IST

టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్తున్నారా?

చాలామందికి టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉండే ఈ-కోలై వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఫోన్ స్క్రీన్‌పైకి చేరుతుంది. చేతులు కడుక్కున్నా, ఫోన్ ద్వారా ఆ క్రిములు ఆహారంతో పాటు శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అంతేకాక, ఫోన్ చూస్తూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

February 20, 2026 / 04:00 PM IST

కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NDL: జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శుక్రవారం మధ్యాహ్నం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కేసులు వాటి పురోగతిపై సీఐ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దన్నారు.

February 20, 2026 / 03:59 PM IST

ఏలూరులో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం

ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సభలో పాల్గొన్న సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక, సామాజిక, అసమానతలు, కుల, మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలన్నారు.

February 20, 2026 / 03:59 PM IST