గుర్తింపు సంఘం ఎన్నికలు(Elections) కూడా నిర్వహించాలంటూ హైకోర్టు TSRTCను ఆదేశించింది. మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్(Employees Union) హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. వారి వాదనలు విన్న కోర్టు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. గతంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని కోరింది.
బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్గా హ్యారీ జోష్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మంచులక్ష్మీ ఆదిపర్వం సినిమాలోనూ నటిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు టపోరి సత్య(Tapori Satya) కన్నుమూశారు. అతని వయసు 45సంవత్సరాలు. మీడియా నివేదికల ప్రకారం, అతడికి కిడ్నీ ఫెయిల్యూర్(Kidney Failure) కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రి(private hospital)లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు.
'మోదీ ఇంటిపేరు'తో దూషించారనే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తాత్కాలిక ఉపశమనం లభించింది. పాట్నా ప్రత్యేక కోర్టు(Patna Special Court)లో విచారణను నిలిపివేశారు. రాహుల్ మంగళవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పాట్నా హైకోర్టు(Patna High court) పేర్కొంది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
వైఎస్ షర్మిల (YS Sharmila) ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం వీడియోలో కనిపించింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.