పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. జై శ్రీ రామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను ఈ మేరకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. వీడియోలో జై శ్రీ రామ్ అంటూ వస్తున్న ఆడియో సాంగ్ అభిమానుల్లో గూస్బంప్స్ తెప్పిస్తుంది.
దేశంలోని మొట్టమొదటి వాణిజ్య లిథియం అయాన్ సెల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని బెంగళూరు(Bengaluru)లో నిన్న ప్రారంభించారు. లాగ్9 మెటీరియల్స్(Log9 Materials) బ్యాటరీ-టెక్నాలజీ స్టార్టప్ ఈ మేరకు మొదలుపెట్టింది.
సికింద్రాబాద్-తిరుపతి(Secunderabad-Tirupati) వందే భారత్ రైలు(Vande Bharat train)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అనేక మందికి టిక్కెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచనున్నట్లు తెలుస్తోంది.
యూపీ(uttar pradesh)లోని హమీర్పూర్(hamirpur) జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ ధరించలేదని పోలీసులు వెయ్యి రూపాయల చలాన్ నోటీస్ పంపించారు. అంతేకాదు ఆ తర్వాత అతను ఫైన్ కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి పదవికి కొత్త ఐఏఎస్ అధికారిని నియమించింది. కార్యదర్శిగా ఐఏఎస్ బీఎం సంతోష్ (BM Santosh) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ (Karimnagar) – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.
రిలయెన్స్ (Reliance) ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని మాజీ గవర్నర్ సత్యపాల్ (Satya Pal Malik) తెలిపారు
ఆరోగ్య శ్రీ (Arogyashri)సేవలకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఖర్చు ఎక్కువైన ఫర్లేదు కానీ పోషకాహారానికే జై కొడుతున్నారు. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. అనేక వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.