• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC ఫైనల్ భారత్ vs ఇంగ్లండ్..?

T20 WC ఫైనల్ పోరు భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జోస్యం చెప్పాడు. సొంత గడ్డపై ఆడుతున్న భారత్ ఈ టోర్నీలోనే బలమైన జట్టుగా ఉందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా ఫైనల్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 08:33 PM IST

అక్రమ మద్యంపై ఎక్సైజ్ దాడులు

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శరత్ నేతృత్వంలో శుక్రవారం కన్నారెడ్డి, జప్తి జానకంపల్లి తండాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 6 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 08:32 PM IST

విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ

MDK: తూప్రాన్ పట్టణ బాలుర, బాలికల పాఠశాలలో చదువుతున్న 31 మంది అనాధ, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు పరీక్ష కిట్స్ అందజేశారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ ఏఈ స్వప్న సహకారంతో విద్యార్థులను గుర్తించి కిట్స్ అందజేసినట్లు వివరించారు.

February 20, 2026 / 08:31 PM IST

నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ భవనంతో గ్రామ సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:31 PM IST

‘నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

ADB: ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న గురుకుల పాఠశాల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కో-ఆర్డినేటర్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.

February 20, 2026 / 08:31 PM IST

అంగన్వాడీ కార్యకర్త మృతి

ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అంగన్వాడి కార్యకర్త ఉస్తెలమూరి విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందింది. 24 సంవత్సరాలుగా గ్రామంలో పనిచేస్తూ గర్భవతులకు, బాలికలకు, చంటి పిల్లలకు సేవలు అందించారు. అందరి ఆదరాభిమానాలను సంపాదించుకున్నారని గ్రామస్థులు అన్నారు. విజయలక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

February 20, 2026 / 08:31 PM IST

చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. ఒమన్ ఆలౌట్

పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. దీంతో ఒమన్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌లెట్, మాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

February 20, 2026 / 08:30 PM IST

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఐ వీరేంద్రబాబుకు సూచించారు.

February 20, 2026 / 08:30 PM IST

ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

VZM: దత్తిరాజేరు(మం) షికారు గంజి ఏపీ మోడల్ స్కూల్లో 2026-2027 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి శుక్రవారం తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు www.apms.apcfss.in వైబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:28 PM IST

సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రం అందజేసిన తలసాని

HYD: అనారోగ్యానికి గురైన మహిళకు CMRF మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్‌నగర్‌లోని బీకేగూడకు చెందిన బొడ్డు స్వప్న అనారోగ్యంతో బాధపడుతోంది. CMRF దరఖాస్తు చేయగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంజూరు పత్రాన్ని అందజేశారు.

February 20, 2026 / 08:26 PM IST

విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్‌

టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా SMలో వెల్లడించాడు. గత 15 నెలలుగా కోర్టులో ఈ న్యాయపోరాటం సాగిందని, చివరకు ఈ అధ్యాయం ముగిసిందని పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సోదరుడైన రాహుల్, గత ఏడాది జరిగిన IPL 2026 వేలంలో CSK రూ. 5.2 కోట్లకు కొనుగోలు సంగతి తెలిసిందే.

February 20, 2026 / 08:26 PM IST

‘ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత ముందుకు రావాలి’

E.G: ఉద్యోగాల కోసం ఎదురు చూసే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే.వాణిధర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాజమండ్రిలో నిర్వహిస్తున్న ‘యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు -అవకాశాలు & సవాళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కేవలం వ్యాపారం కాదన్నారు.

February 20, 2026 / 08:25 PM IST

‘ఎస్టీలకు ఆధార్ కార్డులు ఇప్పించాలి’

W.G: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని, శ్మశాన వాటిక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం కమ్యూనిటీ భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ.. కాలనీలోని యానాది సామాజిక వర్గానికి చెందిన పలువురికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవని ఆవేదన చెందారు.

February 20, 2026 / 08:24 PM IST

మంత్రి తుమ్మలతో షబ్బీర్ అలీ కీలక భేటీ

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చురుకైన అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

February 20, 2026 / 08:24 PM IST

జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: DIEO

ASF: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ శుక్రవారం తెలిపారు. 5,025 మంది మొదటి సంవత్సరంలో, 4,691 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

February 20, 2026 / 08:23 PM IST