GNTR: టీడీపీ ప్రభుత్వం ‘రెడ్ బుక్’ రాజ్యాంగంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఈ నెల 21న ‘చలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
NLG: భారతీయ తపాలా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, నమ్మకమైన నెట్వర్క్ అని నల్గొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం నర్సింగ్భట్ల పోస్టాఫీస్లో నిర్వహించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఆయన మాట్లాడారు. పోస్టాఫీస్లోని పలు ప్రభుత్వ పథకాలు, పొదుపు స్కీమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఏఐ సమ్మిట్లో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు యూత్ కాంగ్రెస్ నేతల కోసం గాలిస్తున్నారు. సుమారు 15కి పైగా వీడియో క్లిప్ల ఆధారంగా నిందితులను గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు.
RR: జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
AKP: గొలుగొండ(మం) చోద్యం వంతెన వద్ద జారిపడిన హ్యాండ్ బ్యాగ్ను కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వరరావు బాధితురాలికి అందించారు. బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి కుటుంబంతో వెళ్తుండగా బ్యాగ్ పోగొట్టుకుంది. గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మి దాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.59,500 నగదు సహా బ్యాగ్ను అందజేశారు.
MHBD: తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై అవగాహన కల్పించి తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు సూచించారు. శుక్రవారం గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై తెలియజేసి సక్రమమైన పద్ధతిలో బోధన ఉంటుందన్నారు.
BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ సందర్శించారు. డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన మెటీరియల్, పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులకు ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
BDK: సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్రెడ్డి(20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జాతీయ రహదారిపై బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో ముందు నిలిచిన వాహనాన్ని ఢీకొని పడిపోగా, వెంటనే వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై దూసుకెళ్లినట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఈ యువకుడి అకాల మరణంతో కుటుంబసభ్యులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.
BPT: అద్దంకి నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న వరి కోత మిషన్ శుక్రవారం బలరామకృష్ణాపురం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు వెంటనే సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు.
సత్యసాయి: హిందూపురంలో మార్చి 15న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సప్తగిరి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో 100కు పైగా బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని తెలిపారు.
NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ASR: జీకేవీధి(మం) సీలేరు ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు, గంజాయి రవాణా నియంత్రణతో పాటు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న నేపథ్యంలో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ విడిచి పెట్టారు.
ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొలిపుర ప్రాంతంలో 7.5 క్వింటల్లా రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. చిలుకూరి లక్ష్మీ నగర్కు చెందిన నిందితుడు షేక్ ఇమ్రాన్ అహ్మద్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
NZB: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.