• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీవారితో వైసీపీ రాజకీయం చేస్తుంది: మంత్రి

కోనసీమ: తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

February 22, 2026 / 08:00 AM IST

సోమందేపల్లిలో రంజాన్ నాలుగవ ఉపవాస దీక్ష నిర్వహణ

సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో ఆదివారం నాలుగవ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మజీద్‌కు చేరుకున్న ముస్లింలు వజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవిత్ర ఖురాన్ పారాయణం, నమాజ్ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్యతను చాటారు.

February 22, 2026 / 08:00 AM IST

హై ప్రోటీన్ ‘పెసరపప్పు ఇడ్లీలు’

పెసరపప్పు ఇడ్లీలు అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలు కలిగిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవిరిపై ఉడికించడం వల్ల ఈ ఇడ్లీలు కడుపుకు తేలికగా ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. తక్కువ కొవ్వు, కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన ఆహారం.

February 22, 2026 / 07:56 AM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ..!

MNCL: భీమారం మండలం నర్సింగాపూర్‌లో దొంగతనం జరిగింది. SI రాజేందర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి సత్తయ్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వివాహానికి వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉన్నాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 22, 2026 / 07:55 AM IST

ఈ నెల 27తో ముగియనున్న పత్తి కొనుగోళ్లు

ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిబంధనల ప్రకారం 2025-26 సీజన్‌కు సంబంధించి మద్దతు ధర (MSP) వద్ద పత్తి కొనుగోలు ప్రక్రియ ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 07:53 AM IST

శ్రీశైలం VIP కాటేజీలో చెలరేగిన మంటలు

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.

February 22, 2026 / 07:51 AM IST

104 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 07:50 AM IST

గల్ఫ్ కార్మికులకు ఆసరా.. హెల్ప్ లైన్ నంబర్ విడుదల..!

NRML: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 93984 21883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

February 22, 2026 / 07:49 AM IST

నర్సీపట్నంలో ఘనంగా కాళికామాత పండుగ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం ఘనంగా శ్రీ కాళికామాత పండుగను నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పండుగలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. కాళికామాతను డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని గుడివరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 07:48 AM IST

ఆ ప్రమాదం జరిగి నేటికి ఏడాది..!

NLG: జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు పనులు అవాంతరాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి నేటికీ ఏడాది అయ్యింది. ఈ ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇంకా 9 కి.మీ పనులు జరగాల్సి ఉంది.

February 22, 2026 / 07:47 AM IST

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ

AP: రాష్ట్ర ప్రభుత్వం, భారత్ నెట్ మధ్య ఇవాళ ఎంవోయూ కుదరనుంది. సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ అందించడం, డిజిటల్ సేవలను విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నారు.

February 22, 2026 / 07:47 AM IST

మాతృభాషపై అభిమానం చాటుకున్న విద్యార్థులు

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అ’ ఆకారంలో కూర్చొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకోవాలని, మాతృభాష అమ్మ లాంటిదని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:46 AM IST