• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

VSP: వేపగుంట మండలం విరాట గర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. దీనివల్ల బాలాజీగార్డెన్స్, శ్రీనివాసనగర్, గొల్లనారాయణ పురం, దత్తసాయినగర్, సింహాద్రినగర్, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

రగ్బీ జట్టు కోచ్‌గా వెంకట్

AKP: చెన్నైలో నేటి నుంచి 23 వరకు జరిగే ‘అండర్-15 సౌత్ జోన్ ఖేలో ఇండియా రగ్బీ’ జట్టు కోచ్‌గా అచ్యుతాపురానికి చెందిన వెంకట్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రగ్బీ అసోసియేషన్ ఏపీ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి నాగ వెంకటరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వెంకట్ అనకాపల్లి ప్రైవేట్ స్కూల్లో వ్యాయామం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 06:30 AM IST

‘టీ-సేఫ్’ యాప్‌ను ప్రతి ఒక్క మహిళ వాడాలి: RSI

WGL: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీం RSI స్వాతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతి మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వినియోగించాలని తెలిపారు.

February 20, 2026 / 06:26 AM IST

సాలూరు లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: సాలూరు 11KV ఫీడర్ల వద్ద చెట్లుకొమ్మలు తొలగించే కార్యక్రమం నిర్వహిస్తున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE గోపాల్‌ నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస కాలనీ నుంచి జైపూర్‌ రోడ్డు వరకు, బంగారమ్మపేట, మరిపల్లి నుంచి రేగాపువలస వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 06:26 AM IST

జిల్లాకు గర్వకారణంగా నిలిచిన దుర్గ భవాని

BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానం సాధించింది. గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.

February 20, 2026 / 06:25 AM IST

2 రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కొవ్వూరు మండలం వేములూరులో కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా శుక్ర, శనివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ 2రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అగ్రికల్చర్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 06:24 AM IST

కృష్ణాపురంలో కుట్టుమిషన్లు, స్ప్రే పంపుల పంపిణీ

KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.

February 20, 2026 / 06:24 AM IST

చీటింగ్ కేసులో జైలు శిక్ష ఖరారు

NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి, ఓబులేసు అనే ఇద్దరికీ చీటింగ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5000 జరిమానాను బనగానపల్లె కోర్టు విధించినట్లు ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

February 20, 2026 / 06:24 AM IST

‘విహార యాత్రల ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చు’

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నిన్న విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందుతారని తెలిపారు. విషయాలను బాగా అవగాహన చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:23 AM IST

టికెట్లపై 6 శాతం రాయితీ

TG: సబర్బన్ ప్రయాణికులకు రైల్వే విభాగం శుభవార్త చెప్పింది. ‘రైల్‌వన్’ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకునే వారికి 6% రాయితీ అందిస్తోంది. జూలై 14 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పరిధిలో సబర్బన్ రైళ్లు, జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

February 20, 2026 / 06:22 AM IST

ఎంపీ వేమిరెడ్డి పీఏ అని చెబుతున్న నకిలీ పీఏ అరెస్టు

NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ బెదిరింపులకు దిగిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

February 20, 2026 / 06:21 AM IST

ట్రాక్టర్ తిరగబడి యువకుడు దుర్మరణం

W.G: ఏలూరుపాడులో గురువారం జరిగిన ప్రమాదంలో తూము జాన్ సతీశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. కలిదిండి మండలం సింగరాయిపాలెంకు చెందిన సతీశ్, చెరువు గట్టు వేస్తుండగా బ్లేడు ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఇంజిన్ కింద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో కుటుంబంలో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 06:20 AM IST

యాదగిరిగుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి.

February 20, 2026 / 06:20 AM IST

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: మెళియాపుట్టి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డివిజనల్ విద్యుత్ అధికారి నర్సింహ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిడ్డిమి, చాపర గ్రామీణ, పారిశ్రామిక పీడర్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. 

February 20, 2026 / 06:20 AM IST

శోభాయమానంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

VKB: ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ పేర్కొన్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వరకు శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.

February 20, 2026 / 06:19 AM IST