• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు మధురవాడలో పవర్ కట్

VSP: మధురవాడ సబ్‌స్టేషన్ పరిధి చంద్రంపాలెం 11KV ఫీడర్‌పై‌ ఫుట్ బ్రిడ్జి పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-3 ఏఈ సింహాచలం నాయుడు తెలిపారు. చంద్రంపాలెం, మధురవాడ మెయిన్ రోడ్, దుర్గ నగర్-1, దుర్గ నగర్-2, కృష్ణ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 05:28 AM IST

ఈనెల 22న ఉత్తరాంధ్ర స్థాయి కోలాటం పోటీలు

PPM: వంగర మండలంలోని రుషింగిలో దుర్గా షిరిడిసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఉత్త రాంధ్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. టీం వివరాలు నమోదు కొరకు 8309487836 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

February 20, 2026 / 05:26 AM IST

22 నుంచి క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

KDP: పులివెందుల పట్టణంలో ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు పీఈటీలు ప్రభాకర్, రవికుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పులివెందుల స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న సత్రం బడి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:25 AM IST

ఏప్రిల్‌ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు 

TG: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

February 20, 2026 / 05:03 AM IST

ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

JGL: కోరుట్ల-అయిలాపూర్ మీదుగా యూసుఫనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయిలాపూర్లో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాన్ని తొలగించమని డ్రైవర్ చెప్పడంతో వాగ్వివాదం ఏర్పడి, యువకులు దాడికి పాల్పడ్డారని ఎస్సై చిరంజీవి తెలిపారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

February 20, 2026 / 05:01 AM IST

‘సాదా బైనమా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’

JGL: పెగడపల్లి మండలంలో సాదా బైనామా భూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ఆనంద్ కుమార్ తెలిపారు. మండలంలో మొత్తం 1840 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇందులో నుంచి 1791 దరఖాస్తులను పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించామని, 49 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:00 AM IST

రైలు ఢీకొని మత్స్యకారుడు మృతి

NZB: నవీపేట్ మండలంలోని యంచ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పోశెట్టి చేపలు పట్టుకొని తిరిగి వస్తుండగా రైలు పట్టాలను దాటే సమయంలో దేవి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 04:54 AM IST

ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: SP

KDP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీసులను కడప జిల్లా SP ఆదేశించారు. గురువారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, మట్కా, బెట్టింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

February 20, 2026 / 04:52 AM IST

కడప జిల్లాలో దారుణం..భర్తను గొడ్డలితో నరికిన భార్య

KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:45 AM IST

దారుణం.. భర్తను గొడ్డలితో నరికిన భార్య

KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:45 AM IST

లక్కీరెడ్డిపల్లి గంగమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 17, 96, 420

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర 3 రోజుల హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. ఈ లెక్కింపు ప్రకారం మొత్తం  రూ.17, 96,420 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఇచ్చిన సహకారం ఆలయ నిర్వహణకు, పూజా కార్యక్రమాల కోసం ఉపయోగపడనుందని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు.

February 20, 2026 / 04:34 AM IST

నందవరం పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

KRNL: నందవరం SC కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో పుల్లయ్య తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని, ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్, హోమ్ డెలివరీ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

February 20, 2026 / 04:27 AM IST

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం: కలెక్టర్

ASF: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక భూమిక ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.

February 20, 2026 / 04:25 AM IST

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. బాగ్‌లిహార్‌ ఆనకట్ట ఏ నదిపై ఉంది?ANS: చీనాబ్‌2. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?ANS: జనవరి 253. భారత ‘ఎయిర్‌ఫోర్స్‌ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు?ANS: అక్టోబరు 84. ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది?ANS: నమ్‌చిక్-నమ్‌ఫుక్

February 20, 2026 / 04:15 AM IST

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు

KNR: చిగురుమామిడి గ్రామంలో వచ్చే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడానికి గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని ఆధ్వర్యంలో ఎంపీవో ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరిలు గ్రామంలో పర్యటించారు. నీటి ట్యాంకుల రిపేరులు, గేట్ వాల్స్ రిపేర్స్, నూతన పైపులైన్లు వేసి చేతి పంపు మెటీరియల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.

February 20, 2026 / 04:09 AM IST