• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘త్వరలో నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం’

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగదుర్గ ప్రసాద్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కళాశాల రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారి కుమార్తె కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారన్నారు. కిడ్నాప్ కేసుగా రిజిస్ట్రేషన్ చేసి, తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీ...

December 10, 2024 / 03:57 PM IST

కేజీబీవీ పాఠశాల భవనం ప్రారంభం

జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన కేడిదొడ్డి‌లో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హన్మంతు ప్రారంభించారు. 2017లో‌ కేటిదొడ్డి మండలానికి పాఠశాల మంజూరు కాగా.. భవనం లేకపోవడంతో ర్యాలంపాడు శివారులోని ప్రభుత్వ సముదాయ భవనంలో కొనసాగిస్తున్నారు.

December 10, 2024 / 03:56 PM IST

కంకిపాడు అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

కృష్ణా: కంకిపాడులో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ.. మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేర్సు రాజలక్ష్మి, ఎంపీడీవో పాల్గొన్నారు.

December 10, 2024 / 03:56 PM IST

పాత బస్టాండ్ వద్ద సీపీఐ నేతలు నిరసన

SKLM: అదాని గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, ప్రోత్సాహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు బి.శ్రీరామూర్తి ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు.

December 10, 2024 / 03:56 PM IST

పశువుల అక్రమ రవాణా పై చర్యలు

VZM: దత్తిరాజేరు మండలం పెదమానాపురం పశువులు సంతలో జరుగుతున్న అక్రమ రవాణా పై చర్యలు చేపట్టాలని, కేసులు నమోదు చేయాలని బొబ్బిలి రెవిన్యూ డివిజన్ అధికారి రామ్మోహనరావు సూచించారు. బొబ్బిలి తన కార్యాలయంలో మంగళవారం జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని వాటి అమలుకు అధికారులు కృషి చేయాలన్నారు.

December 10, 2024 / 03:56 PM IST

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

కృష్ణా: ఎ.కొండూరు మండలంలోని పాత కొండూరు పెద్దబీడులో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చి ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేయాలని కోరుతూ.. మండల సీపీఎం ఆధ్వర్యంలో దళితులు కొండూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 7న జరిగిన రెవెన్యూ సదస్సులో దళితులు తహశీల్దార్ ఆశయ్యకు వినతి పత్రం అందజేసినట్లు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి పానెం తెలిపారు.

December 10, 2024 / 03:54 PM IST

వంగవీటి రంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులో మాజీఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన వంగవీటి విగ్రహానికి భూమి పూజ చేశారు.

December 10, 2024 / 03:54 PM IST

‘చలో హైదరాబాద్‌కు తరలి రావాలి’

ADB: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే దగాపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ధూంధాం కళాకారులు లింగంపల్లి రాజలింగం కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్యతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 12, 13వ తేదీలలో హైదరాబాదులోని ఎస్వీకేలో కళాకారుల కార్యక్రమం ఉంటుందన్నారు.

December 10, 2024 / 03:53 PM IST

భారత్‌ తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్..!

డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తుది జట్టులో రెండు మార్పులు ఉంటాయని అంచనా వేశాడు. అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్‌ కృష్ణలను తుది జట్టులోకి తీసుకుంటారని తెలిపాడు.

December 10, 2024 / 03:52 PM IST

సీఎంతో వంగవీటి రాధ భేటీ

AP: సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.

December 10, 2024 / 03:49 PM IST

ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల

AP: వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. దీనిలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సూచించారు.

December 10, 2024 / 03:46 PM IST

ఘనంగా సెమీ క్రిస్మస్

ASR: డుంబ్రిగుడ మండలంలో జంగిడివలస, అడ్రగూడ జాంగూడ గ్రామాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరకు నియోజవర్గం నాయకురాలు సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు పలు పోటీలను నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు.

December 10, 2024 / 03:44 PM IST

ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత

TG: వికారాబాద్ జిల్లాలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 10, 2024 / 03:39 PM IST

తెలంగాణ తల్లి దేవతామూర్తితో సమానం: జగదీష్‌రెడ్డి

TG: కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాషను అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని పేర్కొన్నారు.

December 10, 2024 / 03:37 PM IST

రాజమండ్రిలో సందడి చేసిన సినీ నటి

EG: రాజమండ్రిలో సినీ నటి నిధి అగర్వాల్ మంగళవారం సందడి చేశారు. ఓ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నిధి అగర్వాల్‌తో పాటు MLA ఆదిరెడ్డి వాసు, వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు

December 10, 2024 / 03:36 PM IST