• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మసీదులో ఆత్మాహుతి దాడి.. 50 మందికి తీవ్రగాయాలు

పాకిస్థాన్ లోని పెషావర్ లో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న మసీదులో పార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు లోపలికి వచ్చి తనకు తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షు...

January 30, 2023 / 03:14 PM IST

ప్ర‌జ‌ల స‌హ‌కారం చూసి కన్నీళ్లు ఆగలేదు : రాహుల్ గాంధీ

భారత జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భార‌త్ జోడో యాత్ర ముగిసిన నేప‌థ్యంలో శ్రీన‌గ‌ర్ లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. మంచు వానను సైతం లెక్క‌చేయ‌కుండా ఆయ‌న ప్ర‌సంగించారు. త‌న పాద‌యాత్రకు స‌హ‌క‌రించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు.జోడో యాత్ర‌తో ప్ర‌జ‌ల స‌హ‌కారం చూసి త‌న‌ క‌ళ్ల వెంట నీరు కారిందని రాహుల్ అన్నా...

January 30, 2023 / 02:35 PM IST

శ్రీనగర్ మంచు అందాలకు రాహుల్, ప్రియాంక ఫిదా

జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీనగర్ లో సోమవారం భారీగా మంచుకురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్న పైకి ప్రియాంక మంచు గడ్డలు విసరడం కనిపిస్తోంది.జోడో యాత్ర ముగింపు...

January 30, 2023 / 02:10 PM IST

viral:దేశీ మమ్మీకి ఫుడ్ కష్టాలు.. జర్మన్ స్నాక్ తినేందుకు పాట్లు

ఫుడ్ విషయంలో మదర్స్ కాంప్రమైజ్ కారు. ఏ టూరో, దైవ దర్శనానికో వెళితే అడ్జస్ట్ కారు, కాలేరు. ఏ ప్రాంతానికి అనుగుణంగా ఫుడ్ తీసుకుంటారు. దేశంలో ఇలా అయితే మరీ ఫారిన్ వెళితే ఎలా ఉంటుంది.. అవును ఓ అమ్మకి ఇలాంటి సమస్యే వచ్చి పడింది. ఫుడ్, స్నాక్స్ అన్నీ వైరెటియే.. అమ్మ ఫుడ్ ఎలా తింటున్నావని కూతురు కావేరి అడిగింది. ఫర్లేదు అని చెప్పింది. ఎక్స్ ప్రెషన్స్ మాత్రం భలేగా ఇచ్చింది. ఆ వీడియోను మీరు […]

January 30, 2023 / 02:39 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై మాజీ కలెక్టర్ నిరసన

జయశంకర్ భుపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్‌లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వర...

January 30, 2023 / 01:30 PM IST

ఈటల కోవర్టు కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్

తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంద...

January 31, 2023 / 02:46 PM IST

క‌రోనా కలకలం.. దేశంలో పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య‌

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోన వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోన కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్సపత్రులు హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,848కు పెరిగిందని వివ‌రించింది. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ లో ఆ వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉండ‌డం దేశ ప్ర...

January 30, 2023 / 02:49 PM IST

పెద్దిరెడ్డి లాక్కున్న వడ్డెర క్వారీలను తిరిగి ఇప్పిస్తాం : లోకేష్

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ప్రజలు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. కుప్పం నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ యాత్రకి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇచ్చే రూ.10పై జగన్ బొమ్మ ఉంటుందని, తీసుకునే రూ.100 ఉండదని చెప్పారు. జనం నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, ఇంటి ...

January 30, 2023 / 02:53 PM IST

తారకరత్నకు ఎంఆర్ఐ స్కాన్.. శరీరం చికిత్సకు స్పందిస్తోంది

నందమూరి తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని బెంగళూర్ నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ రోజు ఎంఆర్ఐ స్కాన్ తీస్తామని తెలిపారు. స్కాన్ రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందజేస్తామని చెబుతున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ...

January 30, 2023 / 11:48 AM IST

గాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు

అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. దేశం కోసం అమరులైన వారందరికీ కూడా తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. అభివృద్ధి చెం...

January 30, 2023 / 11:06 AM IST

మంగళగిరి సీఐడీ కార్యాలయానికి చింతకాయల విజయ్

ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సోమవారం మంగళగిరి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతీ లక్ష్యంగా విజయ్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతి పే’ అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీన కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ [&hell...

January 30, 2023 / 11:06 AM IST

సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. బాటిల్ విసిరిన వ్యక్తి, అరెస్ట్

ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాశ్ ఖేర్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి అతనిపై బాటిల్ విసిరేశాడు. ఈ ఘటన కర్ణాటకలో గల హంపీలో జరిగింది. సంగీత కచేరి నిర్వహిస్తోండగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంతలో ఒకతను దాడి చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హంపీలో సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. కొందరు యువకులు అతి చేశారు. వేదిపై కైలాశ్ ఖేర్ పాటలు పాడుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు వాటర్‌ బాటిల...

January 30, 2023 / 02:23 PM IST

ఆల్ పార్టీ మీటింగ్: కో ఆపరేట్ చేయండి.. కేంద్రం రిక్వెస్ట్

బడ్జెట్ సమావేశాలు రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు.. దీంతో బడ్జెట్, సభకు సహాకరించాలని విపక్షాలను కేంద్రం కోరనుంది. అందుకోసం ఈ రోజు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సభ సజావుగా జరిగేందుకు సహాకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంద...

January 30, 2023 / 10:14 AM IST

వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సోమవారం విడుదల చేయనున్నారు. 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హు...

January 30, 2023 / 09:36 AM IST

మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం…

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ ,తెలంగాణలో ప్రగతి గురించి వివరించనున్నారు. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకత...

January 30, 2023 / 09:17 AM IST