తిన్న 4-6 గంటల తర్వాత దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడటం మొదలవుతుంది. 12 గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్గా మారుతుంది. 24 గంటల తర్వాత చిగుళ్లు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఎయిమ్స్కి చెందిన దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఒక రోజు పళ్లు తోముకోకపోతే నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.