రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. విమానాశ్రయానికి PM మోదీ స్వయంగా వెళ్లి అధ్యక్షుడికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇరు నేతలు ఒకే కారులో రా. 7 గంటలకు ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్కు చేరుకోనున్నారు. అక్కడ పుతిన్కు మోదీ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో పలు అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకోనున్నాయి.