ప్రతికూల వాతావరణం వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 10 విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, విశాఖ, కోయంబత్తూర్, కోల్కతా, కోచి, వారణాసి, ఇండోర్, పాట్నా, గౌహతికి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆయా నగరాలకు వెళ్లే ప్రయాణికులు గుర్తుంచుకోవాలని సూచించింది.